- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెరువులో పడి వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ, నాగిరెడ్డిపేట్ : గేదెలను మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందాడు. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట గ్రామానికి చెందిన జూకంటి రాజు (34) అనే వ్యక్తి శనివారం ఉదయం కూలి పని నిమిత్తం గోపాల్పేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గేదెలను మేతకు తీసుకెళ్లాడు. దాంతో నాగిరెడ్డిపేట గ్రామ శివారులోని జగ్గ చెరువులో గేదెలు నీళ్లలోకి దిగి ఒడ్డుకు రాకపోవడంతో జూకంటి రాజు వాటిని ఒడ్డుకు చేర్చేందుకు నీళ్లలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని తల్లి జూకంటి దుర్గవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Advertisement
Next Story