చెరువులో పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ, నాగిరెడ్డిపేట్ : గేదెలను మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందాడు. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట గ్రామానికి చెందిన జూకంటి రాజు (34) అనే వ్యక్తి శనివారం ఉదయం కూలి పని నిమిత్తం గోపాల్పేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గేదెలను మేతకు తీసుకెళ్లాడు. దాంతో నాగిరెడ్డిపేట గ్రామ శివారులోని జగ్గ చెరువులో గేదెలు నీళ్లలోకి దిగి ఒడ్డుకు రాకపోవడంతో జూకంటి రాజు వాటిని ఒడ్డుకు చేర్చేందుకు నీళ్లలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని తల్లి జూకంటి దుర్గవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed