సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ..ఎంపీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం

by Prasad Jukanti |
సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ..ఎంపీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం
X

దిశ,డైనమిక్ బ్యూరో:దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌ నివాసానికి చేరుకున్న సుహాసిని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 2018 ఎన్నిక్లలో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని మహాకూటమిలో భాగంగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఎంపీ ఎన్నికల వేళ సీఎంతో ఆమె భేటీ ఆసక్తిగా మారింది.


Advertisement

Next Story

Most Viewed