ఉపాధిహామీ పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

by Disha Web Desk 15 |
ఉపాధిహామీ పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
X

దిశ, భువనగిరి రూరల్ : మండలంలోని తుక్కాపూర్ లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారులు మంగళవారం సందర్శించి పరిశీలించారు. శ్రద్ధ శుక్ల, కిరణ్మయి కొప్పిసేతి, నారాయణ అమిత్ మలేంపతి, వికాస్ మహతో, ఉమా శంకర్ ప్రసాద్, మాయాంక్ సింగ్ లు 2022 బ్యాచ్ కు సంబంధించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను, వేతనాలను అడిగి తెలుసుకున్నారు. పని జరుగుతున్న ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు అందుతున్న సౌకర్యాలు నీడ, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను ట్రైనీ ఐఏఎస్అధికారులు పరిశీలించారు. అనంతరం పల్లె పకృతి వనంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ఆర్. సునంద, డీఆర్డీఓ ఎంఏ కృష్ణన్, జెడ్పీ సీఈఓ ఎన్ శోభారాణి, ఎంపీఓ అనురాధ, పంచాయతీ కార్యదర్శి ఏ. రాజు, ఫీల్డ్​ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed