ఎమ్మెల్యేను కలిసిన రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు

by Naveena |   ( Updated:2024-10-22 13:03:41.0  )
ఎమ్మెల్యేను కలిసిన రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు
X

దిశ,చౌటుప్పల్ :రీజనల్ రింగ్ రోడ్డుతో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని ప్రభుత్వంతో మాట్లాడి.. అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైన చెల్లించాలని రాజగోపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కిలోమీటర్ల వరకు తీసుకున్నారని తెలిపారు. ఉత్తరభాగానికి వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 28 కిలోమీటర్ల దూరం మాత్రమే తీసుకున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాగా ఉత్తరభాగం,దక్షిణ భాగం జంక్షన్ చౌటుప్పల్ వద్ద వస్తున్న నేపథ్యంలో..భూములు ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుందని వీలైతే అలైన్ మెంట్ లో మార్పులు తీసుకురావాలని, అది సాధ్యం కాకపోతే భూములు కోల్పోతున్న మాకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉందో అంత ధర చెల్లించే విధంగా ప్రభుత్వంతో చర్చించాలని వేడుకున్నారు. ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను చర్చిస్తానని రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed