నల్గొండలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మంది?

by Y.Nagarani |
నల్గొండలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మంది?
X

దిశ, వెబ్ డెస్క్: నల్గొండలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తుండగా.. నల్గొండ జిల్లా కేంద్రంలో చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారిలో శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు బోల్తా పడటంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

మర్రిగూడ బైపాస్ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను పెట్టారు. రోడ్డుపై ఉంచిన ఆ బారికేడ్లను తప్పించే క్రమంలో బస్సు పల్టీ కొట్టినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో ప్రాణభయంతో పెద్ద అరుపులు పెట్టారని అక్కడున్నవారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. అంబులెన్సుల్లో క్షతగాత్రులను స్థానిక జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed