రేపు సూర్యాపేటలో గవర్నర్ పర్యటన

by Naveena |   ( Updated:2024-10-23 13:58:30.0  )
రేపు సూర్యాపేటలో గవర్నర్ పర్యటన
X

దిశ సూర్యాపేట కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా.సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చేయిస్తున్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను పిపిటి ద్వారా గవర్నర్ కు వివరించనున్నారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఐదు స్టాళ్లను గవర్నర్ తిలకించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి11:30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం,అనంతర శాఖల వారిగా తమ లక్ష్యాలను గవర్నర్ కు వివరించనున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన వివిధ కళాకారులు కవులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలిస్తున్నారు..

Advertisement

Next Story

Most Viewed