'నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర సర్కారు చెలగాటం'

by Vinod kumar |
నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర సర్కారు చెలగాటం
X

దిశ, దేవరకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లేకులతో.. పరీక్షల రద్దులతో నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర సర్కార్ చెలగాటం ఆడుతుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యలమల గోపీచంద్ అన్నారు. గురువారం ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదురుంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మతో శవయాత్ర చేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం పేపర్ లీకులతో.. పరీక్షల రద్దులతో మొదటి స్థానంలో నిలిచిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుందని మండిపడ్డారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రెండోసారి రద్దు కావడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిర్దర్శనమన్నారు. ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి రెండోసారి కూడా పరీక్ష రద్దుకి కారణమైన ప్రభుత్వాన్ని వెంటనే బర్తరపు చేయాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. ఈ కార్యక్రమంలో నగర సోషల్ మీడియా అంకురి శ్రీకాంత్, లింగాల రాజేష్, తులసిరాం, విక్రమ్, మహిళా, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story