Manholes : ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్‌..అధికారులు పట్టించుకోరా..?

by Naveena |
Manholes : ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్‌..అధికారులు పట్టించుకోరా..?
X

దిశ,నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నందికొండలో మ్యాన్‌ హోల్స్‌ ప్రమాదకరంగా మారాయి. దీంతో పట్టణవాసులు నిత్యం ప్రమాదాల బారినపడుతున్నారు.పైలాన్‌ కాలనీల్లో నిత్యం వందల మంది కాలనీవాసులు వాహనదారులు ప్రయాణించే మార్గం కావడంతో.. వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మ్యాన్‌ హోల్స్‌ ప్రధాన రహదారులతో పాటు..పలు వీధుల్లో మ్యాన్‌ హోల్స్‌ను ఏర్పాటు చేశారు. కాలేజ్ విద్యార్థులు ,చిన్న పిల్లలు స్కూల్‌కు వెళ్లే దారిలో ఇలా గుంత ఏర్పడటంతో.. ప్రమాదకరంగా మారింది. అంతేకాకుండా ఈ కాలనీలో రోడ్డుపైనే చెత్తను పడేస్తున్నారు. నందికొండ మున్సిపాలిటీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ చెత్తలో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో దుర్గంధం వెదజల్లడంతో.. కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసిన.. పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇకనైనా మా సమస్యను ఆలకించి త్వరగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed