పాతగుట్టలో దివ్యవాణితో ప్రకటనలు కొనసాగించాలి

by Naveena |
పాతగుట్టలో దివ్యవాణితో ప్రకటనలు కొనసాగించాలి
X

దిశ, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం పాత లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద దివ్యవాణి నుంచి వివిధ రూపాలలో వచ్చే ప్రకటనను నిలిపివేశారు. దీంతో ప్రకటనలను తిరిగి కొనసాగించాలని కౌన్సిలర్ దండెబోయిన అనిల్, స్థానిక యువకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావును కలిసి యువకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ..దేవస్థానం ఆలయ అభివృద్ధిలో భాగంగా దివ్యవాణి ప్రకటనను నిలిపివేశామన్నారు. ఈ క్రమంలో పాతగుట్ట ఆలయానికి భక్తుల రద్దీ తగ్గిపోయింది. దీంతో ఆలయ అభివృద్ధికి చాలా ఇబ్బందులు కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు. పాత పద్ధతి ప్రకారం పాతగుట్ట ఆలయం గురించి ప్రకటనలు, వివిధ కార్యక్రమాలు చేస్తే..ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని స్థానికులు ఆరోపించారు.

Advertisement

Next Story
null