- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ కాదు.. కాంగ్రెస్ సర్కార్ దానంతట అదే కూలిపోతుంది: లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్లో కాక రేపుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు తరుచూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిపోతుందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు సైతం ప్రతిపక్షాలను ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ను టచ్ చేస్తే మాడి మసైపోతారని సీఎం రేవంత్ రెడ్డిగా ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి కాంగ్రెస్ సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానంతట అదే పడిపోతే మాత్రం మేం ఏమీ చేయలేమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారమని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓ పక్కా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టదని చెబుతూనే.. అదే పడిపోతే మేం ఏం చేయలేమనడం వెనక అర్థం ఏంటని చర్చించుకుంటున్నారు. బీజేపీ ఏ గుడుపుఠాణీ చేయకపోతే అసలు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కూలిపోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.