‘కవితకు పట్టిన గతే పడుతోంది’.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు MP అర్వింద్ వార్నింగ్..!

by Disha Web Desk 19 |
‘కవితకు పట్టిన గతే పడుతోంది’.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు MP అర్వింద్ వార్నింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన నిజామాబాద్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పట్టిన గతే పడుతోందని హెచ్చరించారు. దేశంలోని హిందువులు అంతా ఏకం కాకుంటే మరో 30 ఏళ్లలో తాలిబన్ అడ్డాగా భారత్ అవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దేశ ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు హామీ ఇచ్చిన అర్వింద్.. నియోజకవర్గ ప్రజలకు మరో ఆఫర్ ఇచ్చారు. తాను ఎంపీ గెలిచిన నెలలోపే చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తానని కీలక హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.



Next Story