- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? : బండి సంజయ్ హాట్ కామెంట్స్
దిశ, గంగాధర: బీజేపీ ప్రధాన అభ్యర్థి మోడీ అని.. మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరంటూ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యల చేశారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర్ మండల కేంద్రంలో నిర్వహించిన స్వీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. గ్యారెంటీలను ప్రశ్నిస్తే.. గాడిద గుడ్డు చూయిస్తున్నారని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారెంటీల మీద లేదని ఆయన అన్నారు. రిజర్వేషన్ రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ రద్దు చేయబోమని, భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.., ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని భగవంతుని మీద ప్రమాణం చేసే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే ప్రజలకు గాడిద గుడ్డు చూపిస్తున్నాడని, కాంగ్రెస్కు ఎన్నికల తర్వాత మిగిలేది ఆ గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డి పదేపదే గాడిద గుడ్డును చూపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం కాదేమోనని, గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తుగా మార్చుకున్నారు అని ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోందని అన్నారు.
పదేళ్ల పాటు ప్రజలను గోస పెట్టిన కేసీఆర్ మళ్లీ ఓట్లు దండుకునేందుకు తుపాకీ రాముడు లెక్క వస్తున్నాడని, మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలనుకుంటున్నాడని ఆరోపించారు. పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ను ఇంకా ప్రజలు మర్చిపోలేదని అన్నారు. దేవుడి అక్షింతలు, తీర్థ ప్రసాదాలను హేళన చేసి దేవుడిని కించపడటమే కాకుండా, మన దైవాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్కు బుద్ధి చెప్పాలన్నారు. ఈసారి జనం బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఇనుగుల పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.