- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీరాముడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. BJP ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై భైంసాలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి భైంసాలో రోడ్ నిర్వహించిన కేటీఆర్పై కొందరు టమాటాలు, ఉల్లిగడ్డలతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 26 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా ఈ ఘటనపై ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. జైశ్రీరాం అనేది మాకు ఎన్నికల నినాదం కాదన్నారు. ఓడినా గెలిచిన దేశం కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.
హిందువులను అవమానించే వారిని దేశం నుండి బహిష్కరించే రోజులు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ కూడా స్పందించారు. శ్రీరాముడిపై కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేటీఆర్పై దాడి కేసులో హనుమాన్ భక్తులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. అరెస్ట్ అయిన హనుమాన్ భక్తులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.