మంత్రి కొమటి రెడ్డి విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

by Mahesh |
మంత్రి కొమటి రెడ్డి విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే నోటికొచ్చిన అబద్దాలు చెప్పి.. ప్రజలను మోసం చేయాలని చూశారని, నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి మాట్లాడకపోవడమే మంచిదని.. ఈ రోజు ఆయన ఆయన మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఏమ్ కనిపించి లేదని అన్నారు. హరీష్ రావు మాట్లాడింది కావొచ్చు, కేటీఆర్ మాట్లాడింది కావొచ్చు, నేను మాట్లాడింది కావొచ్చు.. సబ్జెక్ట్ కాకుండా వేరే ఏదైనా బూతు పదమో, ఇంకేదైనా మాట్లాడలేదని.. ఇవాళ వెంకట్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రజల సమస్యను పక్కదారి పట్టించడం కోసం మంత్రి చిల్లర చేష్టలు చేస్తున్నారని,, మేము దాంట్లోకి పోదలుచుకోలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed