BREAKING: రైతులకు గుడ్ న్యూస్.. తడిచిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
BREAKING: రైతులకు గుడ్ న్యూస్.. తడిచిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులెవరూ అధైర్యపడవద్దని.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని.. ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇక నుండి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చినట్లుగా పంద్రాగస్ట్ లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాగా, గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు సెంటర్లలో పోసిన వరి ధాన్యం తడిసి ముద్ద అయ్యింది. ఆరుగాలం కష్ట పడి పంట పండించిన రైతులు తీరా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పనికిరాకుండా పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. తడిచిన ధాన్యం కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది.

Next Story