‘కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు’

by Disha Web Desk 19 |
‘కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీవీ ఛానెల్ డిబేట్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారుని ఫ్రస్ట్రేషన్‌లో అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనిని షాకింగ్ కామెంట్స్ చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తున్నామన్నారు. పదేళ్లలో సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు, పలువురు సెలబ్రెటిల ఫోన్ల ట్యాపింగ్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.



Next Story

Most Viewed