రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-10-04 11:41:20.0  )
రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దని అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భఁగా మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. రైతన్నల ఆదరణతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని ఎన్ని కష్టాలు వచ్చినా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అణలు చేస్తామన్నారు. రైతులకు అన్ని సబ్సీడీ పథకాలను మళ్లీ పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు. రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు కలిగిన వారు రెండు లక్షలకు పైన ఉన్న నగదును ఈ నెలలో చెల్లించాలని వారికి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని చెప్పారు. తెలంగాణలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story