జేటీసీపై దాడి.. పోలీసులకు మంత్రి పొన్నం కీలక ఆదేశం

by Satheesh |
జేటీసీపై దాడి.. పోలీసులకు మంత్రి పొన్నం కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్‌పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదులు చేసుకోవాలి కానీ ఇలా అధికారుల మీద దాడులు సరైంది కాదన్నారు. ఉద్యోగులపై దాడులు సరికాదని, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. దాడి ఘటనపై పోలీస్ అధికారులతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్‌లో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జేటీసీపై దాడి చేసిన వ్యక్తి పై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story