బిగ్ అలర్ట్.. ఇకపై వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. తేల్చిచెప్పిన మంత్రి పొంగులేటి

by Satheesh |   ( Updated:2024-06-23 11:28:37.0  )
బిగ్ అలర్ట్.. ఇకపై వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. తేల్చిచెప్పిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని.. ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్‌ను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. రెండు లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ సైతం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed