Meenakshi Natarajan : గాంధీ భవన్​లో "మీనాక్షి" ఎఫెక్ట్​

by M.Rajitha |
Meenakshi Natarajan : గాంధీ భవన్​లో మీనాక్షి ఎఫెక్ట్​
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై హైదరాబాద్​లోని గాంధీ భవన్​రూపు రేఖలు మారనున్నాయి. ఎప్పడు నేతలు, నాయకుల కటౌట్​లు, బ్యానర్లు, ఫెక్సీలలతో కలకలలాడే గాంధీ భవన్ ​కాస్తా ఖాళీగా కనిపినున్నది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన మీనాక్షి నటరాజన్​ ఎఫెక్ట్​తోనే గాంధీ భవన్లో కటౌట్​లు, బ్యానర్లు, ఫెక్సీలు కనిపించకుండా పోనున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జీగా బాధత్యలు చేపట్టాక ఆమె తొలిసారి హైదరాబాద్​కు విచ్చేస్తున్నారు. గాంధీ భవన్​లో శుక్రవారం నిర్వహిస్తున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షి నటరాజన్​ పాల్గొననున్నారు. నూతన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మొదటిసారి తెలంగాణ కు విచేస్తున్న సందర్భంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవద్దని మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్​కు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీ లు, బొకేలు, శాలువలు ఎవరు ఏర్పాటు చేయవద్దని ఇది వరకే సూచించారు. మీనాక్షి నటరాజన్​కు కాంగ్రెస్​ పార్టీలో సింప్లిసిటీ ఉమెన్​గా పేరున్నది.

ఆమె చాలా స్టిక్ట్​ లీడర్​అని, ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలకు అస్సలు నచ్చవని పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇకపై గాంధీ భవన్ లో, పరిసర ప్రాంతాలలో కూడా నేతలు, నాయకుల కటౌట్​లు, బ్యానర్లు, ఫెక్సీలలతో ఉండకుండా టీపీసీసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న నేతల, నాయకుల తోరణాలు, కటౌట్​లను తొలగించారు. కేవలం అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతల ఫొటోలు ఉండేలా చూస్తున్నారు. గాంధీ భవన్​లో నిర్వహిస్తున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షి నటరాజన్​తోపాటుగా అలాగే, ముఖ్యమంత్రి సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, కీలక నేతలు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ ​రాకతో గాంధీ భవన్​లో తీసుకున్న చర్యలతో సర్వాత్రా చర్చ జరుగుతోంది.

Next Story