- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు : మంత్రి మల్లారెడ్డి
దిశ, అల్వాల్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ ఈ సేవ సెంటర్ నుండి ఓల్డ్ అల్వాల్ ఇందిర గాంధీ నిర్వహించిన భారీ రాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతం ప్రజల కోసం ఆలోచించి దేశంలో ఎక్కడలేని పథకాలు ప్రవేశ పెట్టి సక్రమంగా అమలు జరుపుతున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల పేదలకు గౌరవంగా బ్రతుకాలనే నెల నెల పింఛన్లు అందజేస్తున్నారని గుర్తుచేశారు.
అంతేకాకుండా పేద వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నామని ఇల్లు ఇవ్వడమే కాకుండా త్రాగునీరు, సాగునీరు, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని తెలిపారు. మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ నాయకుడిగా మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని సభాముఖంగా మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రిగా మీ అందరికి అన్ని వేళల అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిశోర్ గౌడ్, సునీత రాము యాదవ్, మీన ఉపేందర్ రెడ్డి, బాలాజీ నగర్ కార్పొరేటర్ మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగరావు, మాజీ కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.