సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా

by Sridhar Babu |
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా
X

దిశ, కూకట్​పల్లి : అల్లాపూర్​ డివిజన్​ పరిధిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంప్​ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డివిజన్​ కార్పొరేటర్​ సబీహ బేగం, కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ డివిజన్​ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు.

అదే విధంగా డివిజన్​ పరిధిలోని రాజీవ్​గాంధీనగర్, సఫ్దర్​ నగర్​ కాలనీ వాసులు హైడ్రాకి భయపడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దాంతో కాలనీవాసులకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్, ఐలయ్య, వీరారెడ్డి, బాబా, నాగుల సత్యం, పిల్లి తిరుపతి, జ్ఞానేశ్వర్, పలు కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story