Road Repair : ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య రోడ్డు వేయండి.. ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ

by Aamani |
Road Repair : ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య రోడ్డు వేయండి.. ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ
X

దిశ,జవహర్ నగర్: వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త బురద మయమైన , వర్షపు నీరుతో బురద మయంగా మారాయి. బురదమయంగా మారిన రోడ్లను చూసి విశ్వజిత్ , 8 సంవత్సరాలు ఉన్న బుడ్డోడు... జవహర్ నగర్ , 28వ డివిజన్ , శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయని , తద్వారా వచ్చే పోయే వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారని,రోడ్లపై నడిచే పాదాచారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదని, ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. గతంలో కేసీఆర్ , ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్న రోడ్లు వేయలేదని , రేవంత్ రెడ్డి కి ఓట్లేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తారని తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పానంటూ , కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి , రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ,శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి సీసీ రోడ్లు వేయండి ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బుడ్డోడి మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఏదైనా స్పందన వస్తుందా... లేదా ఒక వేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలే కాక , యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురుచూస్తోంది.



Next Story