- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి..
దిశ, శామీర్ పేట: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శామీర్ పేట మండలం మురహరిపల్లిలో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు చెందిన 2376 డబుల్ బెడ్ రూమ్లను లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పంపణీ చేశారు. వారికి కేటాయించిన ఇళ్ళను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సొంతింటిని నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ ఇళ్లను అందచేస్తున్నారని తెలిపారు.
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 1188, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 1,188 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి అవకతవకలు, రాజకీయాలు, పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులను ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడంలో అధికారుల కృషి ఎంతో ఉందని మంత్రి మల్లారెడ్డి వివరించారు.
అనంతరం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించారని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో కృష్ణ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.