మోదీని మరోసారి పీఎం చేద్దాం : ఈటల జమున

by Disha Web Desk 23 |
మోదీని మరోసారి పీఎం చేద్దాం : ఈటల జమున
X

దిశ,ఉప్పల్:మోడీని మరోసారి పీఎం చేద్దామని ఈటల జమున అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మంగళవారం కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారానికి ఈటెల రాజేందర్ సతీమణి జమున హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూరదృష్టి గల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ముందడుగు వేసి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మోడీని ప్రధానమంత్రి చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.కార్పొరేటర్ శ్రీవాణి రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదాన్ని అక్షరాల ఆచరణలో పెడుతున్న ప్రధాని మోడీ భారతీయుల జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బండి పద్మ, ముత్తినేని జగదీష్, గడ్డం సాయికిరణ్, బాలకృష్ణ గౌడ్, కుమారస్వామి,రేవు నరసింహ, మాణిక్యం,సంతోష్, వెంపటి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, వేముల తిరుపతయ్య, బి.లింగం,దయానంద రెడ్డి,బొడ్డుపల్లి ఆనంద్,తమ్మల రవి, జటా ధీరజ్ , తాళ్ళమంగా,అంబటి భాగ్యలక్ష్మి, అరుణ,వీణ,తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed