- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
అనుమతులు ఒకలా... నిర్మాణాలు మరోలా...
దిశ, కూకట్పల్లి: మూసాపేట్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. అనుమతులు ఒకలా తీసుకుని తమకు ఇష్టం వచ్చినట్టు బహుళ అంతస్థులను నిర్మిస్తూ కొంత మంది బిల్డర్లు ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారు. 12 నుంచి 15 ఫీట్ల రోడ్డులలో ఏకంగా 5 నుంచి 7 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టి జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పెడుతున్నారు. ఒకటి రెండు కుటుంబాలు నివాసం ఉండాల్సిన భవనాలలో పరిమితికి మించి వ్యక్తులు నివాసం ఉంటుండడంతో డ్రైనేజి వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్, ట్రాఫిక్, రోడ్లపై అక్రమ పార్కింగ్ ఇలా సమస్యల వలయంలో ఆయా కాలనీలు చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
జీహెచ్ఎంసీకి సవాల్ విసురుతున్న నిర్మాణదారులు..
మూసాపేట్ సర్కిల్ పరిధిలోని కేపీహెచ్బీ డివిజన్, బాలాజీ నగర్ డివిజన్లలో అక్రమ నిర్మాణాల జోరు గత కొంత కాలంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. వంద గజాలు, రెండు వందల గజాల స్థలంలో ఏకంగా 5, 6, 7 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులు అధికారులకు పెద్ద సవాల్గ మారారు. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్కు సమీపంలోని హెచ్ఐజి కాలనీలో ఓ వ్యక్తి ఏకంగా ఆరు అంతస్థుల నిర్మాణం ఎటువంటి నిబంధనలు, సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణం చేపడుతున్నారు. భువజన విజయం మైదానం సమీపంలో కొందరు అనుమతలకు విరుద్దంగా 5,6 అంతస్థుల నిర్మాణం చేపట్టి జీహెచ్ఎంసీ అధికారులకు సవాల్ విసురుతున్నారు.
పెరుగుతున్న భారం..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరు గాంచిన కేపీహెచ్బీ కాలనీ నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించింది. కాలనీలో ఎల్ఐజి, ఎంఐజీ, హెచ్ఐజీలుగా తరగతులును విడదీసి వంద గజాల నుంచి 300 గజాల వరకు ప్లాట్లను కేటాయించి హౌసింగ్ బోర్డు శాఖ అప్పట్లో 12 నుంచి 25 ఫీట్ల వరకు రోడ్లను కేటాయించి లేఔట్ చేశారు. 12 ఫీట్ల రోడ్డులో నిర్మించిన బహుళ అంతస్థుల నిర్మాణాల కారణంగా తరచు డ్రైనేజి పొంగడం, తాగునీటి సరఫరా సరిపోక పోవడం, విద్యుత్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కొత్త డ్రైనేజీ వ్యవస్థ, తాగు నీటి పైప్లైన్ పనులు చేపట్టాలంటే ప్రభుత్వానికి ఇది అదనపు భారంగా మారింది. అసలు ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించిన భవనాలు ఉన్న కాలనీలలో ప్రజా ధనాన్ని వృద్ధా చేస్తు మౌలిక వసతులు కల్పించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.