కాంగ్రెస్, బీజేపీలు అవినీతి కవలలు : మంత్రి హరీష్ రావు

by Shiva |
కాంగ్రెస్, బీజేపీలు అవినీతి కవలలు : మంత్రి హరీష్ రావు
X

దిశ, నాచారం : జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అవినీతికి కవల పిల్లలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ సీఎం‌గా కేసీఆర్ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్, టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వి.యాదగిరి, టీడీపీ మాజీ కౌన్సిలర్, స్టేట్ ఎస్టీ సెల్ సెక్రటరీ బానోత్ గోవర్ధన్ నాయక్, టీడీపీ చిలుకానగర్ డివిజన్ ఇంచార్జ్ కోళ్ల రవికుమార్ గౌడ్, బీజేపీ హబ్సిగూడ డివిజన్ జనరల్ సెక్రటరీ బానోత్ పండునాయక్, చిలుకానగర్ డివిజన్ బీజేపీ నాయకులు ఓరుగంటి శ్రీనివాస్ గౌడ్ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వారికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజాసేవే పరమావధిగా పని చేస్తున్న బండారు లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వారు గత 30 ఏళ్ల నుంచి టీడీపీ పార్టీకి సేవలు అందించారని తెలిపారు. కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామరావు, గోల్లురి అంజయ్య, నియోజకవర్గ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ బద్రిద్దీన్, పల్లె రాజకుమార్ గౌడ్, పిల్లి నాగరాజు, మోతె రఘు తిరుపతి రెడ్డి, కొత్త రామారావు, వరుణ్, మనీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed