విద్యుత్ శాఖ అధికారి ఇంటిపై లంచం కేసులో ఏసీబీ సోదాలు

by Disha Web Desk 23 |
విద్యుత్ శాఖ అధికారి ఇంటిపై లంచం కేసులో ఏసీబీ సోదాలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో: లంచం కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. 2023 సంవత్సరంలో కీసర విద్యుత్ ఏఈ గా పనిచేస్తున్న సమయంలో అనిల్ కుమార్ ఓ విషయమై 12 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వల పన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు అప్పట్లో కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు బుధవారం అల్వాల్ లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రూ. 34 లక్షల నగదు, 223 గ్రాముల బంగారంతో పాటుగా కోటి రూపాయల 76 లక్షల పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుందని ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు.



Next Story

Most Viewed