తెలంగాణలో రైతులకు శుభవార్త..నేటి నుంచి అకౌంట్‌లో నిధుల జమ

by Disha Web Desk 18 |
తెలంగాణలో రైతులకు శుభవార్త..నేటి నుంచి అకౌంట్‌లో నిధుల జమ
X

దిశ,వెబ్‌డెస్క్: యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా(రైతు బంధు) పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3 రోజుల పాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంట నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఈ ఘటన పై తెలంగాణ ప్రభుత్వం స్పందిచిన సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందడుగు వేసింది. కాగా పంట నష్టానికి గురైన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కాగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పది జిల్లాల్లో 1,58,121 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మార్చి నెలలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనుంది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

Next Story

Most Viewed