రేపు మూడో దశ ఎన్నికల పోలింగ్.. మొత్తం ఎన్ని స్థానాలంటే..?

by Disha Web Desk 12 |
రేపు మూడో దశ ఎన్నికల పోలింగ్.. మొత్తం ఎన్ని స్థానాలంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: 2024 లోక్ ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా.. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 94 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. గుజరాత్ లోని 26 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. దీంతో పాటుగా.. గోవా 2, అస్సాం 4, బీహార్ 5, చత్తీస్‌ఘర్ 7, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 9, మహారాష్ట్ర 11, ఉత్తర ప్రదేశ్ 10, పశ్చిమ బెంగాల్ 4, అలాగే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ 2 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. కాగా ఈ దశలో పలువురు కేంద్ర మంత్రులు పోటీలో ఉన్నారు.

Next Story

Most Viewed