ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

by Disha Web Desk 15 |
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
X

దిశ, సంగారెడ్డి : మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిందని, మాట ఇచ్చాం నిలబెట్టుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ నామినేషన్ సందర్భంగా మంత్రి దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిందని, ఇంకా నాలుగు సంవత్సరాల 8 నెలల సమయం ఉందన్నారు. ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.

ప్రతి పక్షానికి సహనం ఉండాలని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. హరీశ్ రావుకు ఎప్పుడూ అబద్దాలు మాట్లాడడం అలవాటు అయింది అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు మౌనంగా కుటుంబ పాలనను ఇంటికి పంపించారన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత మిగిలిన ఒక్కదానిని కూడా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, షబ్బీర్ అలీ, మధన్ మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed