హరితహారం చెట్లను నరికిన వెంచర్ నిర్వాహకులు..

by Sumithra |
హరితహారం చెట్లను నరికిన వెంచర్ నిర్వాహకులు..
X

దిశ, ఝరాసంగం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన చెట్లను అధికారుల ఆదేశాలకు విరుద్ధంగా కొందరు వెంచర్ల నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని చిలేమామిడి నుంచి కోహిర్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను ఓ వెంచర్ కి సంబంధించిన వ్యక్తులు నరికి వేశారు.

వెంచర్ లోకి విద్యుత్తు తీగలను తీసుకునేందుకు ఈ పనిచేశారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం పై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ ను వివరణ కోరగా వెంచర్ కి సంబంధించిన వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలను నుంచి నోటీసులు ఇచ్చి, తిరిగి వాళ్ళ ద్వారానే మొక్కలను నాటిస్తామని తెలిపారు.

Advertisement

Next Story