- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
'ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇండ్లు ఎవరికి కేటాయించారు.. ఎవరుంటున్నారు'
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇండ్లు ఎవరికి కేటాయించారు..? ఎవరు ఉంటున్నారు..? నెలాఖరులోగా పూర్తివివరాలు ఇవ్వాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. సిద్దిపేట, గజ్వేల్ డివిజనులలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలలో సౌకర్యాలు, కాలనీలో ఉంటున్న వారి వివరాలు గురించి రెవెన్యూ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ అండ్ కాలనీలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్తు, డ్రైనేజి, హెల్త్ సెంటర్, పాఠశాలలు, వైకుంఠ ధామాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్, సిద్దిపేట ఆర్డీవోలు బన్సీలాల్, సదానందం, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఈడబ్ల్యూ ఐడీసీ, ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.