కొనసాగుతున్న ఎంపీ నామినేషన్లు

by Disha Web Desk 15 |
కొనసాగుతున్న ఎంపీ నామినేషన్లు
X

దిశ, సంగారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి బీబీ పాటిల్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి బాబు దుర్గయ్య రోమాల, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ నుంచి చావగంటి మణి తమ నామినేషన్లను కలెక్టర్ వల్లూరు క్రాంతికి అందజేశారు.

అయితే సోమవారం రోజున అత్యధికంగా ఏడు నామినేషన్లు దాఖలు కాగా మంగళవారం మాత్రం మూడు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.



Next Story