ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

by Aamani |
ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
X

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమ మైనింగ్ చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గత నెలలో ఈడీ అధికారులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.19 లక్షల నగదుతో పాటు కొన్ని సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ డీ అధికారులు విచారణకు పిలిచారు. సీజ్ చేసిన మొబైల్ ఫోన్ లో సమాచారాన్ని సేకరించే ప్రక్రియతో పాటు పలు లావాదేవీల వివరాలను విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎమ్మెల్యేని పిలిచినట్లు తెలుస్తుంది.

Next Story