- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం
దిశ, గజ్వేల్/ కొండపాక : రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్టమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం గజ్వేల్ నియోజక వర్గ కేంద్రంలో జగ్గారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో, మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీల్లో దాదారు రెండు గంటలపాటు జగ్గారెడ్డి రోడ్ షో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీకి 25వేల మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి గజ్వేల్ ప్రజలకు అన్ని పనులు చేయిస్తానని హామీనిచ్చారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు రావాల్సిన పరిహారాలు
ఇప్పిండంతో పాటుగా సమస్యల పరిష్కార బాధ్యత తీసుకుంటా అన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ కు మెజారిటీ ఇవ్వాలన్నారు. బీసీ నేత నీలం మధు ముదిరాజ్ ని భారీ అధిక్యంతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు అధికారులతో కలిసి ఆడుకున్నారని..ఇప్పుడు మనం ఆడుకుందాం అన్నారు. కలెక్టర్, ఎస్పీ మొదలు ఇతర అధికారులు మీరు చెప్పినట్లే పనిచేస్తారన్నారు. ఏ పోలీస్ కూడా కాంగ్రెస్ కార్యకర్తల వెంట్రుక కూడా టచ్ చేయలేరన్నారు. ఏదైనా జరిగితే నేనే స్వయంగా వస్తా అన్నారు. ఈ కార్యక్రమం లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మెమాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎలక్షన్ రెడ్డి ,గజ్వేల్ ప్రజ్ఢాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయిని యాదగిరి , సయ్యద్ మతీన్ పాల్గొన్నారు.