పోలీసుల తనిఖీల్లో రూ. 14 లక్షల 62వేల సీజ్

by Disha Web Desk 11 |
పోలీసుల తనిఖీల్లో రూ. 14 లక్షల 62వేల సీజ్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 14 లక్షల 62వేలు పోలీసులు సీజ్ చేశారు. వన్ టౌన్ సీఐ లక్ష్మీబాయి తెలిపిన వివరాల ప్రకారం...మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీలో సిద్దిపేట పట్టణానికి చెందిన ఎం రమేష్ మోటార్ సైకిల్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.8లక్షల 62 వేలు తీసుకొని వస్తున్నట్లు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన సీహెచ్ రాములు మోటార్ సైకిల్ లో తీసుకెళ్తున్న రూ.6లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన డబ్బులు కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించి డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చన్నారు. 50వేల కంటే ఎక్కవ డబ్బులు తీసుకొని వెళ్లే సమయంలో సంబంధిత పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed