మా పార్టీ నామరూపాలు లేకుండా చేసేందుకు మోడీ కుట్ర: CM

by GSrikanth |
మా పార్టీ నామరూపాలు లేకుండా చేసేందుకు మోడీ కుట్ర: CM
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ఆరోపణలు చేశారు. ఆదివారం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్‌ను అంతం చేసేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఆపరేషన్ చీపురు మొదలు పెట్టారని అన్నారు. మరోవైపు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేసిన తర్వాత, అతన్ని నాలుగు గంటల పాటు విచారించారు. అర్థరాత్రి పోలీసులు బీభవ్‌ను తీస్ హజారీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బిభవ్‌ను 5 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపింది. దీంతో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.






Next Story