పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యావు

by Disha Web Desk 15 |
పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యావు
X

దిశ, చిన్నకోడూరు : పాలనపై అవగాహన లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఎలా అయ్యావని రేవంత్ రెడ్డిని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ కి మార్చే అంశం సుప్రీంకోర్టులో ఉందని, లాయర్ ను పెట్టి వాదిస్తాననడం రేవంత్ రెడ్డికి తెలవకన, లేక ముదిరాజులను మోసం చేయడమా అన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని బీసీ కమిషన్ కు ఆదేశాలు పంపించిందని అన్నారు. నేటి వరకు బీసీ కమిషన్ దగ్గర ఉన్న

ఫైల్ ను కదిలించడం లేదన్నారు. బీసీ కమిషన్ వద్ద ఉన్న ఫైల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా తెప్పించుకొని ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలను ముదిరాజులు నమ్మే ప్రసక్తి లేదన్నారు. మరోసారి నమ్మి మోసపోలేమని, ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇచ్చి, వారిని బీసీ ఏలోకి మారుస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తేనే ముదిరాజ్ సమాజం రేవంత్ రెడ్డిని నమ్ముతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య ముదిరాజు, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మిద్దె రవి ముదిరాజు, యువత జిల్లా అధ్యక్షుడు పడిగ లింగం ముదిరాజు పాల్గొన్నారు.

Next Story