MLA : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

by Kalyani |
MLA : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
X

దిశ, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(MLA Mainampally Rohit Rao) అన్నారు. సోమవారం మండల పరిధి కామారం గ్రామంలో నూతనంగా ముత్యాలమ్మ గుడిని ప్రతిష్టించారు. ముత్యాలమ్మ బోనాల కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు సోమవారం రాత్రి గ్రామంలోని అమ్మవారిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారం మాజీ సర్పంచ్ గడిల సుధాకర్, జగ్గారి ఎల్లం, బండ రాములు, గొల్ల శ్రీశైలం, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story