ఢిల్లీలో స్మృతివనం నిర్మాణం కోసం మట్టి సేకరణ..

by Vinod kumar |   ( Updated:2023-10-10 14:55:36.0  )
ఢిల్లీలో స్మృతివనం నిర్మాణం కోసం మట్టి సేకరణ..
X

దిశ, ఆందోల్: 'మేరా మిట్టి.. మేరా దేశ్' ప్రోగ్రామ్‌లో భాగంగా మంగళవారం జోగిపేట పట్టణంలో బీజేపీ మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో స్మృతివనం నిర్మాణం కోసం మట్టిని సేకరిస్తున్నట్లు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అద్యక్షుడు నరేందర్‌రెడ్డి, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇంచార్జీ, కర్నాటక ఎమ్మెల్యే అభయ్‌ పటేల్, టేక్మాల్‌ మండలాల పార్టీ అద్యక్షులు పండరి, అశోక్, రాజు, జిల్లా నాయకులు కొత్త శ్రీను, జగన్మాథం, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed