- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పచ్చి అబద్దాల పార్టీ కాంగ్రెస్
దిశ, నిజాంపేట : ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం అన్నారు. ఈ మేరకు రామాయంపేట మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం అంటూ మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత రేవంత్దే అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కల్యాణ లక్ష్మి కింద నిరుపేద మహిళలకు ఒక లక్ష 16 వేల 16 రూపాయలు ఇచ్చి ఒక పెద్ద అన్నగా ఉన్నాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రుణమాఫీ మర్చిపోయాడు అన్నారు. పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామ గ్రామానికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు అని తెలిపారు. కేసీఆర్ కిట్ ద్వారా మహిళలకు హాస్పిటల్లో పెద్దన్నగా ఆదుకున్నాడన్నారు. బీజేపీ దేవుళ్లను వెంబటేసుకొని ఓట్లు అడుగుతున్నారన్నారు. బీజేపీ చేసిందేమీ లేదని, 60 రూపాయలు ఉన్న పెట్రోట్ రూ. 107 చేశారని, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచారన్నారు. ఈ రెండు పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు అన్నారు. పేద ప్రజలకు అన్నం పెట్టిన పెద్దన్న కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి , ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, కంటరెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.