పూర్తయిన పోస్టుమార్టం… శవాల తరలింపు

by Kalyani |
పూర్తయిన పోస్టుమార్టం… శవాల తరలింపు
X

దిశ, తూప్రాన్ : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏడుగురి పోస్టుమార్టం ఆసుపత్రి సూపర్డెంట్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముగిసింది. కాగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయగా యాక్సిడెంట్ కి కారణమైన వ్యక్తి రావాలి అంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. కావాలని చంపాడని ఆరోపించారు. దీనితో కొంత ఉద్రిక్తత ఏర్పడగా డీఎస్పీ వెంకట్రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఇతర నాయకులు సర్ది చెప్పడంతో శవాలను వారి సొంత గ్రామాలకు తరలించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి అండగా ఉండాలని వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story