తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష

by Disha Web Desk 15 |
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష
X

దిశ, పటాన్ చెరు : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్రామిడ్డికి మద్దతుగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, చైతన్య నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దడంతో పాటు అవినీతిరహిత పాలన అందించామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు

సమస్యలన్నింటికీ పరిష్కారం చూపామని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తూ ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్ చెరు జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లలితా సోమిరెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సతీమణి ప్రణీత రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed