పెన్షనర్లకు అండగా బీఆర్ఎస్ పార్టీ

by Disha Web Desk 15 |
పెన్షనర్లకు అండగా బీఆర్ఎస్ పార్టీ
X

దిశ,పటాన్ చెరు : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఆదివారం సాయంత్రం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ సొసైటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహెచ్ఈఎల్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేసి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పెన్షన్లు

మంజూరు చేయించడం జరిగిందని గుర్తు చేశారు. 247 మంది పెన్షనర్లకు పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. వీటితో పాటు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ కాలనీలలో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించినట్టు తెలిపారు. ఉన్నత విద్యావంతుడైన వెంకట్రామ్ రెడ్డిని గెలిపిస్తే పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు అందుతాయని తెలిపారు. భవిష్యత్తులోనూ పెన్షనర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వెంకట్రామి రెడ్డి సతీమణి ప్రణీత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, నగేష్ యాదవ్, సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు వైకుంఠరావు, ఫహీం, ఇక్బాల్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed