దారుణం.. వడ్డీ డబ్బుల కోసం అన్న, వదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు

by Nagam Mallesh |
దారుణం.. వడ్డీ డబ్బుల కోసం అన్న, వదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామ, లక్ష్మణుడిలా కలిసి ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య వడ్డీ డబ్బులు చిచ్చు పెట్టాయి. తన వడ్డీ డబ్బులు ఇవ్వట్లేదని ఓ తమ్ముడు తన అన్న వదినను చెట్టుకు కట్టేసిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం నసర్ పురకు చెందిన పరుశురాములు, కనకయ్య అన్నదమ్ములు. కనకయ్య వద్ద అన్న పరుశరాములు రూ.లక్ష ఇరువై వేలు అప్పుగా తీసుకున్నారు. లక్ష రూపాయలు తిరిగి చెల్లించాడు. మిగిలిన రూ.20 వేలతో పాటు మిత్తి ఇవ్వాలంటూ వదినను, అన్నను కనకయ్య చెట్టుకు కట్టేశాడు. దీంతో బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed