వ్యవసాయ పరికరాల కోసం 24 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

by Kalyani |
వ్యవసాయ పరికరాల కోసం 24 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
X

దిశ, మునిపల్లి : 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలకు రైతులకు అందిస్తున్నందున ఈనెల 24వ తేదీ లోగా అర్హులైన మహిళ రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అంజలి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఒక పాస్ ఫోటో తో పాటు దరఖాస్తు ఫిలప్ చేసి వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు. ఈ పథకం మహిళా రైతులకు మాత్రమే వర్తిస్తుందని, ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని ఆమె కోరారు.

Next Story