ఎమ్మెల్యే రాజాసింగ్​ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?

by M.Rajitha |
ఎమ్మెల్యే రాజాసింగ్​ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. హైదరాబాద్​నగరంలోని గోషామహల్ సెగ్మెంట్ నుంచి 2014 నుంచి ఇప్పటి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నియోజకవర్గం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉంటుంది. అయినప్పటికీ ఈ మార్చిలో షురూ అయిన బడ్జెట్​సెషన్స్ లో ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాజాసింగ్​ప్రభుత్వంపై విరుచుపడే వీలున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారనే దానిపై చర్చా కొనసాగుతోంది. రాజాసింగ్​ఎక్కడున్న తనదైన మార్క్​ను చూపించే నేత.. అయితే సమావేశాల వేళ సైలెన్స్ గా ఉండడం వెనుక అంతర్యమేమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అసంతృప్తినా..లేక పార్టీ అంతర్గత సమస్యలా?

ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీలోనే ఒక రెబల్​అన్న పేరున్నది. అయితే, బీఆర్ఎస్​హయంలో హైదరాబాద్​నగరం నుంచి బీజేపీ ఏకైకంగా గెలిచిన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి ఎనిమిది మంది గెలుపొందగా గోషామహల్ నుంచి రాజాసింగ్​మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈక్రమంలోనే తనకు అసెంబ్లీ ఎల్పీ లీడర్ గా అవకాశం ఇవ్వాలని బీజేపీ అదిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. సీనియర్​నేత అయిన రాజాసింగ్​కు పార్టీ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీనికితోడు రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలతో ఆయన రెబల్​గా మారారు. ప్రస్తుతానికి సీరియస్​గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఛాన్స్​ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీకి దూరంగా ఉన్నారు.

అయితే, తనకు శాసన పక్ష నేతను చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారని, దాంతోనే రాజాసింగ్​అసెంబ్లీకి రావడం లేదని పార్టీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. దీనికితోడు పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్లే ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారని పార్టీలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈనెల 12వ తేదీన ప్రారంభమై పది రోజులుగా కొనసాగుతన్న బడ్జెట్ సమావేశాలలో గోషామహల్​ఎమ్మెల్యే కానరాకపోవడంపై రాజాసింగ్​ఎక్కడ? అని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఆయన అసెంబ్లీకి హాజరుకాకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటన్నదానిపై పార్టీ వర్గాల్లోనే కాకుండా సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

Next Story

Most Viewed