- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: కాంగ్రెస్కు గుడ్ బై.. బీజేపీలో చేరిన మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి

దిశ, వెబ్డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో నేడు బీజేపీలో చేరారు. అస్సాం మాజీ సీఎం, కేంద్రమంత్రి శర్బానంద్ సోనావాల్ ఆధ్వర్యంలో మర్రి శశిధర్ రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ అరవింద్ సహ పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్భానంద్ సోనోవాల్ మాట్లాడుతూ.. మర్రి శశిధర్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని విమర్శించారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణలో అభివృద్ధే జరగలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని అడ్డుకోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే టీఆర్ఎస్ లాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కంటే సీఎం కేసీఆర్కి కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.