మంత్రివర్గ విస్తరణపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
మంత్రివర్గ విస్తరణపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుందని అన్నారు. కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీ మార్పులపై రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని అన్నారు. తమ పార్టీ విధానాలు, పాలన చూసి నేతలు వస్తే చేర్చుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉపఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదు. ఒకవేళ ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, మరోవైపు మంత్రివర్గ విస్తరణంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైనా సర్కార్ ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కీలకమైన పోస్టులలో సమర్థులను నియమించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆరు స్థానాలకు రెండు రెడ్డి సామాజిక వర్గానికి, బీసీలకు రెండు, ఎస్టీ ఒకటి, ఎస్సీకి లేదా మైనారిటీలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎవరికి అవకాశం ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed